భార్య మీద కోపంతో కూతురిని చంపిన తండ్రి

Maharashtra Man Assassinated 20 Month Old Daughter Over Rs 5 - Sakshi

రూ. 5 అడిగిందని భార్యతో గొడవ

కోపంతో చిన్నారిని గట్టిగా తలుపులకేసి కొట్టాడు

ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. భార్య మీద కోపంతో ఏడాదిన్నర కూతురిని చంపిన పైశాచిక ఘటన ముంబైలో జరిగింది. మంగళవారం(ఫిబ్రవరి 2న) జరిగిన ఈ ఘటనపై మృతురాలి తల్లి టోవేరా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి భర్తను అరెస్టు చేశారు. వివరాలు.. ముంబై నుంచి 900 కిమీలో దూరంలో ఉండే లోవేరా గ్రామంలో వివేక్‌ యైకా(28) భార్య వర్ష, కూతురు వైష్ణవితో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన సాయంత్రం ఇంటికి వచ్చిన నిందితుడితో కూతురు వైష్ణవి ఏడుస్తుందని తనకి స్వీటు కొనివ్వాలని భార్య అడిగింది. ఇందుకు అయిదు రూపాయలు కావాలని చెప్పింది. అయితే నిందితుడు తన వద్ద చిల్లర లేదని చెప్పడంతో వర్ష అతడితో గొడవకు దిగింది. ఆవేశంతో నిందితుడు 20 నెలల కూతురు వైష్ణవిని ఎత్తుకుని తలుపుకు, మెట్లకు చిన్నారి తలను గట్టిగా పదేపదే కొట్టాడు. (చదవండి: అబార్షన్‌.. యువ దంపతుల ఆత్మహత్య)

అయితే వర్ష అతడిని ఆపే ప్రయత్నం చేయడంతో నిందితుడు ఆమెపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె కూడా గాయపడింది. అయితే చివరకు భర్తను అడ్డుకుని కూతురిని టోవేరాలోని హాస్పిటల్‌కు తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. అనంతరం బాధిత చిన్నారి తల్లి టోవేరా పోలీసు స్టేషన్‌లో భర్త వివేక్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై టోవేరా పోలీసు స్టేషన్‌ ఎస్సై యోగేష్‌ పార్ధి మాట్లాడుతూ.. బాధిత చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు వివేక్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. నిందితుడికి, వర్షకు 2018లో వివాహం అయ్యిందని చెప్పారు. ఈ క్రమంలో నిందితుడు తరచూ తాగి తనని వేధించేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొనట్లు తెలిపారు. దీంతో నిందితుడిని వదిలి పుట్టింటికి వెళ్లిన ఆమె 2019లో తిరిగి అతడి దగ్గరికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. (చదవండి: దారుణ హత్య.. సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు..!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top