యువ దంపతుల బలవన్మరణం

Madhya Pradesh Couple Eliminates Themselves In Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలోని కుమ్మరి వాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యువ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్‌- కరీనా జంట స్థానికంగా నివాసం ఉంటున్నారు. పానీపూరీ బండి నడిపిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే గత కొంతకాలంగా వ్యాపారం సరిగ్గా సాగక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.

ఇందుకుతోడు, నెల రోజుల క్రితం కరీనాకు అబార్షన్‌ అయింది. దీంతో మనస్తాపం చెందిన దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై వనటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబాలకు ఈ వార్తను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.(చదవండి: విషాదం: తల్లీ, కూతురు ఆత్మహత్య..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top