గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. లగ్జరీ గెస్ట్ హౌస్లో యజమానికి తెలియకుండా..
సాక్షి,గచ్చిబౌలి(హైదరాబాద్): గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గెస్ట్హౌస్పై దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక్నగర్లోని శ్రీ వినాయక లగ్జరీ గెస్ట్ హౌస్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బుధవారం సాయంత్రం 6.30 గంటలకు దాడి చేశారు. (చదవండి: Khammam: బాలికతో వృద్ధుడి అసభ్య ప్రవర్తన.. కౌగిలించుకుని )
యజమానికి తెలియకుండా అందులో పని చేసే ప్రకాశ్కుమార్ సాహు(25) నిర్వాహకులకు అద్దెకు ఇస్తూ యువతీ, యువకులను లోపలికి అనుమతిస్తున్నాడు. సాహుతో పాటు దిల్సుఖ్నగర్కు చెందిన విటుడు కుమార్(30)ను అరెస్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్కు చెందిన ఇద్దరు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. నిందితుల నుంచి రెండు సెల్ ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు విజయ్, రాహుల్ పరారాలో ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.