దారుణం.. భార్య శీలాన్ని శంకించి..

Husband Who Assassinated His Wife In Karnataka - Sakshi

హుబ్లీ(కర్ణాటక): భార్య శీలాన్ని శంకించి భర్త ఆమెను హత్య చేసిన ఘటన కుసుగల్‌ గ్రామంలో చోటు చేసుకుంది.  గ్రామ కిల్లావీధి నివాసి మెహరున్నీషా హతురాలు కాగా ఆమె భర్త సైఫలీని పోలీసులు అరెస్టు చేశారు. గదగ్‌కు చెందిన వీరు ఉపాధి కోసం కుసుగల్‌ గ్రామానికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం సైఫలీ భార్యను హత్య చేశాడని హుబ్లీ గ్రామీణ పోలీసులు తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top