కుమారుడి పెళ్లికి షిర్డీకెళ్తే.. ఇంట్లో భారీ చోరి
సాక్షి, హైదరాబాద్: నేరేడ్మెట్లోని సైనిక్పురి కాలనీలో ఆదివారం అర్ధరాత్రి ఓ ఇంట్లో భారీ చోరి జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి నరసింహారెడ్డి ఇంట్లో దాదాపు రూ.3కోట్ల విలువచేసే బంగారం, వెండి, నగదును ఎతత్తుకెళ్లారు. నరసింహారెడ్డి కుటుంబసభ్యులు కుమారుడి వివాహ నేపథ్యంలో షిరిడీ వెళ్లిన సమయంలో ఈ చోరి జరిగింది. కుటుంబ సభ్యులతో పాటు పెళ్లికి వచ్చిన బంధువలు ఆభరణాలు కూడా చోరికి గురైనట్లు తెలుస్తోంది. అయితే వారి ఇంట్లో వాచ్మెన్గా పనిచేసే నేపాల్ వ్యక్తే చోరికి పాల్పడినట్లు భావిస్తున్నారు. నిందితుడు చోరీ అనంతరం ఇంట్లో ఉన్న స్కూటీ మీద వెళ్లి దానిని రెండు కిలోమీటర్ల దూరంలో వదిలి పరారయ్యాడు. ఘటనకు సంబంధించిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న కుషాయిగూడ పోలీసులు సీసీ ఫుటేజ్, వాచ్మెన్ ఫోన్కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.