పొలంలో రైతు దారుణ హత్య 

Farmer Assasinate in farm At Nellore District - Sakshi

కావలి రూరల్‌: పొలంలో పని చేసుకుంటున్న రైతును గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే దారుణంగా హత్య చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పెద్దపుత్తేడులో గురువారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం.. కొండూరు మధుసూదన్‌రెడ్డి(54) తన పొలంలో పనిచేసుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి గొంతుకోసి హత్య చేసి పరారయ్యారు.  

నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం సీఐ కోటేశ్వరరావు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే మధుసూదన్‌రెడ్డికి గ్రామంలో ఎలాంటి గొడవలూ లేవని, హత్య ఎవరు, ఎందుకు చేశారో అర్థం కావడం లేదని స్థానికులు చెప్పారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top