తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. జాతీయ రహదారి వంతెనపై నుంచి ఓ బస్సు కింద పడింది. బుధవారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. కాసేపటి తర్వాత వీరిని గుర్తించిన స్థానికులు బయటికి తీయడంతో గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదని పోలీసులు చెబుతున్నారు. రాత్రివేళ డ్రైవర్కు నిద్ర రావడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.