తమిళనాడు మాజీ మంత్రి ఆస్తులపై ఏసీబీ దాడులు 

ACB Raids On Former Minister MR Vijayabhaskar Houses And Offices - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణాశాఖా మంత్రిగా వ్యవహరించిన ఎంఆర్‌ విజయభాస్కర్‌ ఇళ్లు, కార్యాలయాలు, పరిశ్రమలు, బంధువుల ఇళ్లపై అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం దాడులు జరిపారు. మంత్రి హోదాలో రవాణాశాఖలో ఉద్యోగ నియామకాలు, కొత్త బస్సులు, విడిభాగాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు అందిన సమాచారం మేరకు చెన్నై, కరూరు జిల్లాల్లో ఏకకాలంలో 21 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. చెన్నైలోని ఇంటి నుంచి కంప్యూటర్లు, హార్డ్‌ డిస్కులు, పెన్‌ డ్రైవ్‌లు, ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో మాజీ మంత్రి విజయభాస్కర్‌ చెన్నైలోని ఇంటిలో ఉన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top