వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

5 Deceased In Road Accident In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ : రూరల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. బుధవారం తెల్లవారుజామున దామెర మండలం పసరగొండ క్రాస్‌ రోడ్‌ వద్ద లారీ డ్రైవర్‌ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టించాడు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు మేకల ప్రవీణ్‌, మేకల రాజేష్‌, మేడి పవన్‌, రోహిత్‌, రహీంలు అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా మృతులంతా 22 నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు కలవారు కావటం గమనార్హం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top