పుట్టినరోజు వేడుకకు ఒప్పుకోలేదని.. 

3 Woman Takes Life In Different Incidents In Karnataka - Sakshi

బెంగళూరు : చిన్న చిన్న కారణాలకే విలువైన జీవితాలను అంతం చేసుకుంటున్నారు కొందరు. బంధుమిత్రులకు తీరని విషాదం మిగుల్చుతూ హోసూరు పట్టణంలో వేర్వేరు సమస్యలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకొన్నారు. హోసూరులోని కుప్పుస్వామి నగర్‌కు చెందిన పుష్పరాజ్‌ కూతురు శ్రీ అపూర్వ(32)కు అరుణ్‌కుమార్‌తో  మూడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఒక కొడుకున్నాడు. కొడుకు పుట్టినరోజును ఘనంగా జరుపుదామని అపూర్వ భర్తను కోరింది. అతడు నిరాకరించడంతో విరక్తి చెంది ఉరివేసుకొంది. వెంటనే గమనించి ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది.

  • మునీశ్వర్‌ నగర్‌కు చెందిన మోహన్‌ భార్య విజయరాణి (27). నాలుగేళ్ల క్రితం వీరు ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. విజయరాణి అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది.  
  • హోసూరు నరసింహ కాలనీకి చెందిన శరవణన్‌ (37) వెల్డింగ్‌ కారి్మకుడు. తాగుడుకు అలవాటు పడడంతో తరచూ కుటుంబంలో గొడవలేర్పడుతుండేది. మంగళవారం ఏర్పడిన గొడవల్లో విరక్తి చెందిన శరవణన్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ కేసులపై ఆయా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top