కారు ప్రమాదం: ముగ్గురు మృతి

3 Assassinated In Road Accident In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మారేడుమిల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో ఆదివారం జరిగింది. ఈ మధ్యాహ్నం పాల్వంచనుంచి మారేడుమిల్లి వైపు వెళుతున్న ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడ్డ వారిని అత్యవసర వైద్యం కోసం హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top