2024లో సెక్టోరల్ అధికారులుగా పనిచేస్తూ డెప్యుటేషన్ ముగియడంతో మాతృసంస్థకు వెళ్లారు. అప్పట్లో నిబంధనల ప్రకారం వారు గతంలో పనిచేసిన ప్రాంతాల్లోనే పోస్టింగ్స్ ఇచ్చి పారదర్శకత పాటించారు. ఇప్పుడు ముగ్గురు సెక్టోరల్ అధికారుల రీ ప్యాట్రేషన్ నియామకాల ఫైల్ కలెక్టర్కు పంపేలా చర్యలు చేపడుతున్నారు. రాజకీయ జోక్యంతో కలెక్టర్ను బురిడి కొట్టించేలా నివేదికలు తయారుచేస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై కలెక్టర్ దృష్టి సారించి అక్రమ పోస్టింగ్స్కు చెక్ పెడతారా? లేదా అని ఉపాధ్యాయ సంఘం నాయకు లు ఎదురు చూస్తున్నారు.


