నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
జాతీయ అంతర్జాతీయ అంశాలు దేశీయ మార్కెట్లో ప్రభావం చూపాయి. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి. రష్యా - ఉక్రయిన్ మధ్య ఉద్రిక్తతలు గురువారం అమెరికన్ మార్కెట్లు నష్టాల బాట పట్టేలా చేశాయి. ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడడంతో శుక్రవారం 11.00గంటల సమయానికి దేశీయ మార్కెట్ లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 105 పాయింట్ల నష్టపోయి 57786 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 17268 వద్ద ట్రేడ్ కొనసాగుతుంది.
కోల్ ఇండియా,ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్,లారెసన్, టాటాస్టీల్,హెచ్డీఎఫ్సీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..క్లిపా, శ్రీసిమెంట్,ఓఎన్జీసీ,దివీస్ ల్యాబ్స్,ఆల్ట్రాటెక్ సిమెంట్,హీరో మోటో కార్ప్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
మరిన్ని వార్తలు