లాభాల బాటలో స్టాక్ మార్కెట్
ఒమిక్రాన్ దెబ్బకు వరుస నష్టాల్ని చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 369 పాయింట్లు లాభపడి 56688 వద్ద, నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 16883వద్ద ట్రేడింగ్ ను కొనసాగిస్తున్నాయి.
టాటా మోటార్స్, హిందాల్కో, ఇండస్ ఇండ్ బ్యాంక్, యూపీఎల్, రిలయన్స్, ఎథేర్ మోటార్స్, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ,టాటా స్టీల్ బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, ఏసియన్ పెయింట్స్, కిప్లా, విప్రో, నెస్లే, బ్రిటానియా,టైటాన్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.