రెండో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: Sensex jumps 259 points, Nifty ends above 14550 - Sakshi

ముంబై: దేశంలో కరోనా కల్లోలంతో కొద్దీ రోజులు నష్టాల్లో కొనసాగిన స్టాక్‌మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. కీలక రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో వరుసగా రెండో రోజు లాభాలతో ముగించాయి. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు గానూ విదేశీ టీకాలకు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడంతో గత సెషన్‌లో జోరుగా సాగిన సూచీలు.. నేడు కూడా అదే బాటలో పయనించాయి. 48,512 పాయింట్లతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్ ఆరంభంలో కాస్త ఒడుదొడుకులను ఎదుర్కొని చివరకు 259.62 పాయింట్ల లాభంతో 48,803.68 వద్ద ముగిసింది. 

అలాగే, నేషనల్ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 76.70 పాయింట్లు లాభపడి 14,681.50 వద్ద ముగిసింది. నిఫ్టీలో టీసీఎస్‌, సిప్లా, ఓఎన్‌జీసీ, విప్రో, అదానీ పోర్ట్స్‌ షేర్లు రాణించగా.. ఐషర్‌ మోటార్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, మారుతి సుజుకీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. లోహ, ఫార్మా రంగాల షేర్లు ఒక శాతం మేర లాభపడగా.. బ్యాంకింగ్, ఆటో షేర్లు నష్టాలను చవిచూశాయి.

చదవండి: ఫ్లిప్‌కార్ట్ చేతికి ట్రావెల్ బుకింగ్ క్లియర్‌ట్రిప్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top