నేడు మళ్లీ వీక్ ఓపెనింగ్?!

SGX Nifty indicates Market may open weak today - Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 39 పాయింట్లు డౌన్‌

నిఫ్టీకి 11,363-11,277 వద్ద సపోర్ట్స్‌

గురువారం యూఎస్‌ మార్కెట్లు.. పతనం

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటూ

ఉన్నట్టుండి గురువారం హైజంప్‌ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి నేడు(11న) డీలా పడే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 39 పాయింట్లు బలహీనపడి 11,428 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ 11,467 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. తీవ్ర ఆటుపోట్ల మధ్య గురువారం యూఎస్‌ మార్కెట్లు పతనమయ్యాయి. ప్రస్తుతం ఆసియాలోనూ అధిక శాతం మార్కెట్లు నీరసంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు నేడు తిరిగి ఒడిదొడుకుల మధ్య ట్రేడయ్యే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 

646 పాయింట్ల హైజంప్
గురువారం కన్సాలిడేషన్‌ నుంచి బయటపడిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా హైజంప్‌ చేశాయి. సెన్సెక్స్‌ 646 పాయింట్లు పెరిగి 38,840 వద్ద నిలిచింది. నిఫ్టీ 171 పాయింట్లు జంప్‌చేసి 11,449 వద్ద స్థిరపడింది. యూఎస్‌ మార్కెట్ల దూకుడు, ట్రేడర్ల షార్ట్‌కవరింగ్‌ వంటి అంశాలు మార్కెట్లకు బలాన్నిచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. ఇంట్రాడేలో గరిష్టంగా సెన్సెక్స్‌ 38,878ను అధిగమించగా.. నిఫ్టీ 11,464ను తాకింది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,363 పాయింట్ల వద్ద, తదుపరి 11,277 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,450 పాయింట్ల వద్ద, ఆపై 11,550 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,234 పాయింట్ల వద్ద, తదుపరి 22,003 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,688 పాయింట్ల వద్ద, తదుపరి 22,910 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 838 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 317 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 959 కోట్లు, డీఐఐలు రూ. 264 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1057 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 620 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top