నేడు మరోసారి లాభాలతో ఓపెనింగ్!
ఎస్జీఎక్స్ నిఫ్టీ 30 పాయింట్లు ప్లస్
ప్రస్తుతం మిశ్రమంగా ఆసియా మార్కెట్లు
యూఎస్- ఎస్అండ్పీ, నాస్డాక్ కొత్త రికార్డ్స్
నిఫ్టీకి 11,440-11,495 వద్ద రెసిస్టెన్స్
నేడు (19న) దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి హుషారుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 30 పాయింట్లు బలపడి 11,435 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఆగస్ట్ నెల ఫ్యూచర్స్ 11,405 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. మంగవారం యూఎస్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. అయితే ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి నెలకొంది. కాగా.. నేడు దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి లాభాలతో ప్రారంభమై తదుపరి దశలో హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
477 పాయింట్లు అప్
వరుసగా రెండో రోజు మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో సెన్సెక్స్ 477 పాయింట్లు జంప్చేసి 38,528 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 138 పాయింట్లు ఎగసి 11,385 వద్ద స్థిరపడింది. వెరసి ఇంట్రాడేలో నమోదైన గరిష్టం 38,571 సమీపంలో నిలిచింది. ఈ బాటలో 11,260 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 11,402 వద్ద గరిష్టాన్నీ, 11,253 వద్ద కనిష్టాన్నీ తాకింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,292 పాయింట్ల వద్ద, తదుపరి 11,198 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,440 పాయింట్ల వద్ద, ఆపై 11,495 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,791 పాయింట్ల వద్ద, తదుపరి 21,411 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,389 పాయింట్ల వద్ద, తదుపరి 22,607 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1135 కోట్లను ఇన్వెస్ట్చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 379 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 333 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 718 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.
మరిన్ని వార్తలు