నేడు ఫ్లాట్ ఓపెనింగ్- ఆపై ఆటుపోట్లు!
ఎస్జీఎక్స్ నిఫ్టీ 7 పాయింట్లు ప్లస్
ప్రస్తుతం మిశ్రమంగా ఆసియా మార్కెట్లు
అటూఇటుగా యూఎస్ ఇండెక్సులు -నాస్డాక్ రికార్డ్
నిఫ్టీకి 11,295-11,342 వద్ద రెసిస్టెన్స్
నేడు (18న) దేశీ స్టాక్ మార్కెట్లు అక్కడ్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ స్వల్పంగా 7 పాయింట్లు బలపడి 11,288 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఆగస్ట్ నెల ఫ్యూచర్స్ 11,281 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. సోమవారం యూఎస్ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. అయితే నాస్డాక్ సరికొత్త గరిష్టం వద్ద నిలిచింది. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి నెలకొంది. దీంతో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
మళ్లీ 38,000కు
సోమవారం రోజంతా అటూఇటుగా కదిలిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి పటిష్టంగా ముగిశాయి. సెన్సెక్స్ 173 పాయింట్లు పుంజుకుని 38,051 వద్ద నిలిచింది. తద్వారా మళ్లీ 38,000 పాయింట్ల మార్క్ ఎగువన స్థిరపడింది. నిఫ్టీ 69 పాయింట్లు ఎగసి 11,247 వద్ద ముగిసింది. అయితే ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,119 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,734 వద్ద కనిష్టానికీ చేరింది. నిఫ్టీ సైతం 11,267- 11,145 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. త
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,172 పాయింట్ల వద్ద, తదుపరి 11,097 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,295 పాయింట్ల వద్ద, ఆపై 11,342 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,433 పాయింట్ల వద్ద, తదుపరి 21,165 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 21,939 పాయింట్ల వద్ద, తదుపరి 22,177 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 333 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 718 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. వారాంతాన ఎఫ్పీఐలు స్వల్పంగా రూ. 46 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 797 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.
మరిన్ని వార్తలు