రెండో రోజూ లాభాల జోరు
మెటల్, బ్యాంకింగ్ జోరు
రోజంతా లాభాల్లో కదలాడిన సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంనుంచి పాజిటివ్గా కదలాడిన సూచీలు వరుగసా రెండో రోజు కూడా లాభాల్లోనే ముగిసాయి. సెన్సెక్స్ 558 పాయింట్లు ఎగిసి 48944 వద్ద, నిఫ్టీ168 పాయింట్లు లాభం తో 14653 వద్ద పటిష్టంగా ముగిసాయి. తద్వారా సెన్సెక్స్ 48900కి ఎగువన, నిఫ్టీ 14650 స్థాయికి పైన స్థిరపడ్డాయి. అన్నిరంగాలు లాభపడినా ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్రంగ షేర్లు లాభాలతో మురిపించాయి. హిందాల్కో, టాటా స్టీల్, ఎ ల్ అండ్టీ, దివీస్ లాబ్స్, బజాజ్ ఫిన్,లాప్ గెయినర్స్గాను, మారుతి సుజుకి, ఎన్టీపీసీ, నెస్లేఇండియా, కోటక్ మహీంద్ర బ్యాంకు, ఎం అండ్ ఎం టాప్ లూజర్స్గాను నిలిచాయి