లాభాల్లో మార్కెట్‌: 49 వేల ఎగువకు సెన్సెక్స్‌

Sensex gains over 300 points - Sakshi

మూడో రోజు లాభాలు, బ్యాంకింగ్‌, ఆటోజోరు

14700 మార్క్‌ను అధిగమించిన నిఫ్టీ

సాక్షి, ముంబై:  స్టాక్‌మార్కెట్‌ భారీ లాభాల్లో కొనసాగుతోంది. వరుసగా మూడు రోజు కూడా పటిష‍్టంగా కీలక సూచీలు కదులుతున్నాయి.  దీంతో సెన్సెక్స్‌ 49వేల ఎగువకు చేరగా, నిఫ్టీ 14700 పైన కొనసాగు తోంది.  మెటల్‌ మినహా దాదాపు అన్నిరంగాల షేర్లు లాభపడుతున్నాయి.  సెన్సెక్స్‌ 343 పాయింట్లు ఎగిసి 49237వద్ద, నిఫ్టీ  92 పాయింట్ల లాభంతో 14746 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. బ్యాంకింగ్‌, ఆటో స్టాక్స్‌ లాభాలు మార్కెట్‌కు ఊతమిస్తున్నాయి.  టీవీఎస్‌  మోటార్స్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌,  ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, బజాజ్‌ఫైనాన్స్‌  లాభపడుతుండగా, యాక్సిస్‌ బ్యాంక్‌,  బ్రిటానియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నష్టపోతున్నాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top