లాభాలతో షురూ- సెన్సెక్స్ సెంచరీ
118 పాయింట్లు పెరిగి 39,198కు చేరిన సెన్సెక్స్
42 పాయింట్లు బలపడి 11,577 వద్ద నిఫ్టీ ట్రేడింగ్
ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే
బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా ప్లస్
బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లకు డిమాండ్
రెండు రోజుల ఆటుపోట్లకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 118 పాయింట్లు బలపడి 39,198 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 42 పాయింట్లు పుంజుకుని 11,577 వద్ద కదులుతోంది. బుధవారం అమెరికా ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను అందుకోగా.. ప్రస్తుతం ఆసియాలో అత్యధిక శాతం మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి.
బ్లూచిప్స్ తీరిలా
ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ బలపడగా.. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫ్రాటెల్, గ్రాసిమ్, హీరో మోటో, బజాజ్ ఆటో, యూపీఎల్, అదానీ పోర్ట్స్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, విప్రో, టైటన్, ఎల్అండ్టీ, డాక్టర్ రెడ్డీస్, ఐషర్, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ 3.2-0.6 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐసీఐసీఐ, పవర్గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, శ్రీ సిమెంట్, జీ 0.8-0.4 శాతం మధ్య డీలాపడ్దాయి.
ఐడియా ప్లస్
ఎఫ్అండ్వో కౌంటర్లలో ఐడియా 10 శాతం దూసుకెళ్లగా.. ఇండిగో, అశోక్ లేలాండ్, మదర్సన్, నౌకరీ, కంకార్, వోల్టాస్, మ్యాక్స్ ఫైనాన్స్, హెచ్పీసీఎల్, భారత్ ఫోర్జ్ 4-1.4 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోపక్క ఎస్కార్ట్స్, జూబిలెంట్ ఫుడ్, టొరంట్ ఫార్మా, దివీస్, వేదాంతా, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఐబీ హౌసింగ్, చోళమండల, టాటా పవర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ 2-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1038 లాభపడగా.. 522 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.
మరిన్ని వార్తలు