బేర్ దెబ్బకు బెంబేలెత్తిన స్టాక్ మార్కెట్!
ముంబై: గత కొద్ది రోజులగా రంకెలేస్తున్న బుల్ని బేర్ ఒక దెబ్బతో పడగొట్టింది. నేడు కూడా మార్కెట్లో బేర్ తన పట్టు నిలపుకుంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడో రోజు కూడా స్టాక్ మార్కెట్ ఉదయం నష్టాలతోనే మొదలుఅయ్యాయి. మూడో త్రైమాసికం ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు మద్యాహ్నం తర్వాత క్రమ క్రమంగా నష్టపోయాయి. అన్నింటికీ మించి ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించేందుకు పోటీ పడుతుండటంతో అమ్మకాలు జోరుమీదున్నాయి. ఫలితంగా దేశీ సూచీలు భారీగా నష్టపోయాయి.
నిన్న బేర్ కొట్టిన దెబ్బకు మదుపరుల రూ.4.82 లక్షల కోట్ల సంపద ఆవిరి అయ్యింది. చివరకు, సెన్సెక్స్ 677.77 పాయింట్లు (1.13%) క్షీణించి 59,306.93 వద్ద నిలిస్తే, నిఫ్టీ 185.60 పాయింట్లు (1.04%) నష్టపోయి 17,671.70 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.90 వద్ద ఉంది. టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఐండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ షేర్లు నేడు భారీగా నష్టపోతే.. అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, శ్రీ సిమెంట్స్ షేర్లు లాభాలు గడించాయి. బ్యాంకు, ఐటీ, విద్యుత్, చమురు & గ్యాస్ సూచీలు నేడు ఎక్కువగా నష్టపోయాయి.
(చదవండి: బిలియనీర్స్.. 42 మిలియన్ల మందిని కాపాడండి!)
మరిన్ని వార్తలు