రెండో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

Nifty Above 17200, Sensex Jumps over 477 points on Dec 28 - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో రోజు వరుసగా లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో సూచీలు లాభలో భాటలో పయనించాయి. ఒమిక్రాన్‌ వల్ల హాస్పిటలైజేషన్‌ పెరగకపోవచ్చుననే అధ్యయనాలు మదుపర్లలో విశ్వాసం నింపడంతో కొనుగోళ్ల జోరు కొనసాగింది. ఐటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ షేర్ల అండతో దేశీయ సూచీలు లాభపడ్డాయి. చివరకు, సెన్సెక్స్ 477.24 పాయింట్లు(0.83%) పెరిగి 57,897.48 వద్ద ఉంటే, నిఫ్టీ 147 పాయింట్లు(0.86%) పెరిగి 17,233.30 వద్ద ముగిసింది. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.69 వద్ద ఉంది. నిఫ్టీలో ఎక్కువ లాభపడిన వాటిలో ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, టైటాన్ కంపెనీ, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నేడు ఎక్కువగా నష్టపోయాయి. అన్ని సెక్టోరల్ సూచీలు క్యాపిటల్ గూడ్స్, ఆటో, ఐటీ, పీఎస్‌యు బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం వరకు పెరగడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.9-1.4 శాతం పెరిగాయి.

(చదవండి: విమాన ప్రయాణికులకు స్పైస్ జెట్ బంపర్ ఆఫర్..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top