Gold Price Hike: బంగారం కొనేవారికి భారీ షాక్!

Gold Price Aug 24: Yellow Metal Rises by Rs 350, Silver Price Rs 63030 - Sakshi

కొత్తగా బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక చెదువార్త. ఈ నెల ఆగస్టు 10 నుంచి పసిడి ధర పెరుగుతూనే వస్తుంది. దీనికి ప్రధాన కారణం కరోనా థర్డ్ వేవ్ భయాలు అని నిపుణులు అభిప్రాయం. నేడు ఇండియన్ జువెలరీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.47,646గా ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు పసిడి ధర రూ.350 పెరిగింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.43,644గా ఉంది.

ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి ₹48,490కు చేరుకుంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర ₹44,450గా ఉంది. విజయవాడ మార్కెట్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.800 పెరిగి రూ.63,030 చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.(చదవండి: స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top