జపాన్‌తో పాటు నేపాల్‌కి ఈమోటరాడ్‌ బైక్స్‌

Emotorad Entered Into Japan and Nepal Market - Sakshi

ముంబై: ప్రీమియం ఎలక్ట్రిక్‌ బైక్స్‌ తయారీ సంస్థ ఈమోటరాడ్‌ తాజాగా జపాన్, నేపాల్‌లో అడుగుపెట్టింది. టి–రెక్స్, ఈఎంఎక్స్‌ బైక్స్‌ను నేపాల్‌లో, గ్లైడర్‌ ఎక్స్‌ప్లోరర్, డాల్ఫిన్‌ మోడల్స్‌ను జపాన్‌లో ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ కంపెనీ యూఏఈ మార్కెట్లో పలు మోడళ్లను విక్రయిస్తోంది.

విదేశాల్లో
పుణే ప్లాంటులో ప్రస్తుతం ఎనమిది రకాల బైక్స్‌ను తయారు చేస్తోంది. ఏటా 90,000 యూనిట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. ఇప్పటి వరకు దేశీయంగా 16,000, విదేశాల్లో 6,300 యూనిట్లను విక్రయించింది. భారత్‌లో 65 నగరాల్లో షోరూంలు ఉన్నాయి.    

తారుమారు
కంబస్టన్‌ ఇంజన్‌ వాహనాల విభాగంలో ఇప్పటికీ జపాన్‌ కంపెనీలదే ఆధిపత్యం. హోండా మొదలు సుజూకి, టయోటా, కవాసాకి, నిస్సాన్‌ తదితర జపాన్‌ కంపెనీలు ఇండియాలో పూర్తి స్థాయి ఆధిప్యం కనబరిచాయి. భారతీయ కంపెనీలతో జత కట్టి ఇక్కడ గట్టి మార్కెట్‌ని సంపాదించాయి. కానీ ఎలక్ట్రిక్‌ వాహానాల యుగం వచ్చే సరికి పరిస్థితిలో మార్పు వస్తోంది. ఇండియన్‌ కంపెనీలు ఏకంగా జపాన్‌కు తమ ఉత్పత్తులను పంపిస్తున్నాయి. అందులో భాగంగా ముందుగా సైకిల్‌ను పోలినట్టు ఉండే ఎలక్ట్రిక్‌ బైకుని ఈమెటరాడ్‌ విడుదల చేసింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top