అదిరిపోయిన ఈ-అశ్వ ఎలక్ట్రిక్‌ బైకులు..

e-Ashwa Automotive launches range of electric vehicles - Sakshi

ముంబై: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ఈ–అశ్వ ఆటోమోటివ్‌ తాజాగా మరికొన్ని వాహనాలను ఆవిష్కరించింది. వీటిలో 12 ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాల మోడల్స్, ఎనిమిది త్రిచక్ర వాహనాల మోడల్స్‌ ఉన్నాయి. గతంలో ఇతర సంస్థలతో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందాలతో ఇప్పటిదాకా ఆయా కంపెనీల బ్రాండ్ల పేరిట ఈ-అశ్వ ఈవీలు విక్రయిస్తోంది. కొత్తగా తమ సొంత బ్రాండ్‌ కింద విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది.

దేశవ్యాప్తంగా తమకున్న 630 పైగా ఎక్స్‌క్లూజివ్‌ అవుట్‌లెట్స్, ఫ్రాంచైజీల ద్వారా అమ్మకాలు సాగించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక సీఈవో వికాస్‌ గుప్తా తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ కు చెందిన ఇ-అశ్వ ఆటోమోటివ్ భారతదేశంలో విస్తృత శ్రేణి ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కంపెనీ రెండు సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. వీటిలో వ్యాపార సంస్థల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బిజినెస్-టు-బిజినెస్ వాహనాలు & వ్యక్తిగత వినియోగదారుల కోసం తయారు చేసిన బిజినెస్-టు-కన్జ్యూమర్ వాహనాలు ఉంటాయి.

(చదవండి: Jio: తగ్గేదె లే అంటున్న రిలయన్స్ జియో!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top