లాభాల బాటలో స్టాక్ మార్కెట్
ముంబై: బేర్ పట్టు వీడుతోందా ? బుల్ మళ్లీ రంకెలు వేసేందుకు సిద్దమవుతుందా అనే విధంగా ఈ రోజు మార్కెట్ పాజిటివ్ నోట్తో మొదలైంది. నవంబర్ ఆరంభం నుంచి నష్టపోతున్న మార్కెట్ సోమవారం సాయంత్రం లాభాలతో ముగియగా మంగళవారం ఉదయం కూడా లాభాలతోనే ఆరంభమయ్యింది. కానీ అరగంలోనే మళ్లీ నష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత తిరిగి పుంజుకుంది.
ఈ రోజు ఉదయం సెక్సెక్స్ 57,272 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు పొందుతూ లాభాల దిశగా వెళ్లింది. ఉదయం 10 గంటలకు 607 పాయింట్లు లాభపడి 57,868 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 17,051 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. 192 పాయింట్లు లాభపడి 17,245 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.