మార్కెట్‌పై బేర్‌ పంజా.. నష్టాలతో మొదలు

Daily Stock Market Updates In Telugu December 27 - Sakshi

ముంబై : మార్కెటను ఉత్తేజ పరిచే సానుకూల పరిణామలు పెద్దగా లేకపోవడంతో మార్కెట్‌ మరోసారి నష్టాల్లోకి జారుకుంది. ఓమిక్రాన్‌ భయాల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కోవిడ్‌ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మరోవైపు నిఫ్టీ సూచీకి చెందిన డిసెంబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్‌ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తన పొజిషన్లను స్క్వేయర్‌ ఆఫ్‌కు ఆసక్తి చూపుతుండటంతో స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనవుతోంది. 

గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 57,124 పాయింట్ల దగ్గర ఆశవాహ స్థితిలో క్లోజయ్యింది. కానీ ఈ వారం మార్కెట్‌లో జోష్‌ కనిపంచకపోడంతో సోమవారం ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 56,948 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలైంది. ఉదయం 9:15 గంటల సమయంలో 56,625 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మార్కెట్‌ ప్రారంభమైన పావు గంటలోనే దాదాపు 0.87 శాతం క్షీణించింది. మరోవైపు నిఫ్టీ 66 పాయింట్లు నష్టపోయి 0.39 శాతం క్షీణించి 16,937 దగ్గర ట్రేడవుతోంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top