లాభాలతో మొదలైన మార్కెట్
ముంబై : గత నెలరోజులుగా లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడుతున్న దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు 9:45 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 564 పాయింట్లు లాభపడి 57,629 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 191 పాయింట్లు లాభపడి 17,174 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. సాయంత్రం వరకు ఇదే జోరు కొనసాగుతుందా లేక ఆరంభ లాభాలు ఆవిరవుతాయా ? అనే సందేహంలో ఇన్వెస్టర్లు ఉన్నారు.
ఈ రోజు దేశీ స్టాక్ మార్కెట్లో ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్ షేర్లు లాభాలు పొందగా డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టపోయాయి.
మరిన్ని వార్తలు