పట్టు వీడని బేర్‌.. 59వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్‌

Daily Stock Market Updates In Telugu - Sakshi

ముంబై: ఈ సెషన్‌లో మార్కెట్‌లో బేర్‌ పట్టు నిలపుకుంది. గత కొంత కాలంగా రంకెలేస్తున్న బుల్‌ని నిలువరించింది. వరుసగా మూడో రోజు కూడా స్టాక్‌ మార్కెట్ నష్టాలతోనే మొదలైంది. మూడో త్రైమాసికం ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఏషియా మార్కెట్లు ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. అన్నింటికీ మించి ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించేందుకు పోటీ పడుతుండటంతో అమ్మకాలు జోరుమీదున్నాయి. ఫలితంగా దేశీ సూచీలు నేల ముఖం చూస్తున్నాయి.  

ఈరోజు ఉదయం 9:30 గంటల సమయంలో బీఎస్‌సీ సెన్సెక్స్‌ 132 పాయింట్లు నష్టపోయింది. దీంతో మరింత కిందికి దిగజారి 59,852 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. అక్టోబరులోనే ఏకండా 61 వేలు పాయింట్లు దాటి వేగంగా 62 వేల పాయింట్ల వైపు అడుగులు వేసిన సెన్సెక్స్‌ ఒక్కసారిగా చతికిలపడింది. మరోవైపు నిఫ్టీ సైతం 18 వేల దగ్గర స్థిరపడేందుకు ఆపసోపాలు పడుతోంది. నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 17,817 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top