ఇన్వెస్టర్లు బెంబేలు.. అమ్మకాల ఒత్తిడి.. నష్టాల్లో దేశీ సూచీలు

Daily Stock Market Update in Telugu February 11 - Sakshi

ముంబై: ఆర్బీఐ నిర్ణయాలు మార్కెట్‌ వర్గాలకు రుచించలేదు. ముఖ్యంగా వృద్ధిరేటుని ఆర్బీఐ తగ్గించింది. ఇదే సమయంలో మార్కెట్‌కు బూస్ట్‌ ఇచ్చే కొత్త నిర్ణయాలు ఏమీ వెలువడలేదు. పైగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుందనే వార్తలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. అంంతేకాకుండా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌ సరళి సైతం ఇన్వెస్టర్లు నిశితంగా గమనించారు. దీంతో లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో గత మూడు రోజులుగా లాభపడుతూ వచ్చిన దేశీ సూచీలు ఈ రోజు ఉదయం మార్కెట్‌ ప్రారంభం కావడంతోనే పతనమవుతూ వస్తున్నాయి.

ఉదయం 9:20 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 508 పాయింట్లు నష్టపోయి 58,418 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 176 పాయింట్లు నష్టపోయి 17,429 పాయింట్ల దగ్గర కొసాగుతోంది. స్మాల్‌, మిడ్‌, లార్జ్‌ క్యాప్‌ షేర్లలో నష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top