శుభం ! లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్
ముంబై : 2021 ఏడాదికి వీడ్కోలు పలుకుతూ స్టాక్మార్కెట్ లాభాలతో మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుండటం దేశీ మార్కెట్లకు కలిసి వచ్చింది. మరోవైపు ఎఫ్ అండ్ ఓ గడువు డిసెంబరు 30తోనే ముగిసింది. దీంతో ఇన్వెస్టర్లు మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు. ఈ వారానికే కాకుంటా ఈ ఏడాదికే చివరి సెషన్ సానుకూల వాతావరణంలో లాభాలతో మొదలైంది.
ఉదయం 9:15 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 55 పాయింట్లు లాభపడి 57,849 పాయింట్ల దగ్గర ట్రేడవుతుండగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 17,244 దగ్గర కొనసాగుతోంది.