ఐపీఓకి అదానీ విల్మర్‌..!

Adani Wilmar IPO Opens on January 27 - Sakshi

ముంబై: ఫార్చూన్‌ బ్రాండుపై వంట నూనెలు విక్రయించే అదానీ విల్మర్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ ఇవాళ(గురువారం) ప్రారంభం కానుంది. ఈ నెల 31తో ముగిసే ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.3,600 కోట్లను సమీకరించనుంది. ఇందుకు ధరల శ్రేణిని రూ.218-230గా నిర్ణయించింది. ఇప్పటికే యాంకర్‌ ఇన్వెస్టర్లకు ప్రతి షేరు ధర రూ.230 చొప్పున 4.09 కోట్ల షేర్లను కేటాయించి రూ.940 కోట్లను సమీకరించింది. ఇష్యూలో సగభాగం(50శాతం)షేర్లను క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిటూషనల్‌ బయ్యర్లకు, 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు, మిగిలిన 15% షేర్లను నాన్‌ ఇన్‌స్టిటూషనల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించింది.

(చదవండి: మార్కెట్‌లోకి కైనెటిక్‌-ఐమా ఈవీ టూ-వీలర్స్‌!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top