
రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
మధిర: మధిర రైల్వేస్టేషన్ సమీపాన శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి (55) రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమార్గంలో వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలుకింద పడి సదరు వ్యక్తి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించామని జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ ఎస్.వేణుగోపాల్రెడ్డి తెలిపారు. అయితే, ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకుల సహకారంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఎర్రుపాలెం: మండలంలోని విద్యానగర్కు చెందిన మునగాల నాగరాజు(25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ పక్కన చెట్ల పొదల్లో ఆయన మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించారు. నాగరాజుకు భార్య ఉండగా, ఇటీవల అత్తగారింటికి వెళ్లిన ఆయన మృతదేహమై కనిపించాడు. మృతదేహం కొంత మేర కుళ్లిపోయి దుర్వాసన వస్తుండడంతో మధిర రూరల్ సీఐ మధు, ఎస్ఐ ఆర్.రమేష్ చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మంటల్లో టాటా ఏస్ దగ్ధం
నేలకొండపల్లి: ఇంజన్ వేడెక్కడానికి తోడు షార్ట్ సర్క్యూట్ కారణంగా వాహనం కాలిపోయింది. హైదరాబాద్కు చెందిన టాటా ఎస్ డ్రైవర్ ఆజాద్ శుక్రవారం ఖమ్మం నుంచి కోదాడ మీదుగా హైదరాబాద్కు వెళ్లేందుకు నేలకొండపల్లి మీదుగా బయలుదేరారు. ఈక్రమంలో పైనంపల్లి టోల్గేట్ వద్ద ఇంజన్ వేడికి తోడు షార్టు సర్క్యూట్ జరగడంతో మంటలు మొదలయ్యాయి. దీంతో డ్రైవర్ వాహనాన్ని పక్కన నిలిపి దిగగానే టాటా ఏస్ పూర్తిగా కాలిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు.

రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య

రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య