కంటిమీద కునుకు కరువు
నేల వాలిన వరి
భట్టిప్రోలు: దిత్వా తుఫాన్ ప్రభావంతో మండలంలో శనివారం సాయంత్రం నుంచి ముసురు పట్టి చిరుజల్లులు కురుస్తున్నాయి. గాలుల ప్రభావంతో కొన్ని చోట్ల వరి చేలు నేలవాలాయి. పలువురు రైతులు యంత్రాల ద్వారా కోత కోసినా.. ధాన్యాన్ని భద్రపరచేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఓదెలపై ఉన్న పంట వర్షపు నీటిలో తడిస్తే గింజలు మొలకెత్తుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓదె దశలో ఉన్న పంటను తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు హడావుడిగా కుప్పలు వేశారు. ఆరబెట్టలేని పరిస్థితి లేకపోవడంతో కుప్పలు వేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం వాతావణ పరిస్థితుల దృష్ట్యా వరి కోతలు కోసి కుప్పలు వేసినానష్టం వాటిల్లదని మండల వ్యవసాయ అధికారి బి.బ్రహ్మారెడ్డి తెలిపారు.
అన్నదాతను భయపెడుతున్న ‘దిత్వా’ తుఫాన్
విత్తు వేసేటప్పుడు చినుకు కోసం ఆశగా ఆకాశం వైపు చూసే అన్నదాత.. నేడు అదే ఆకాశం వైపు భయం.. భయంగా చూడాల్సిన దుస్థితి. పంట చేతికొచ్చే సమయానికి దూసుకొచ్చే తుఫాన్ల దెబ్బకు రైతులు హతాశులవుతున్నారు.. ఇప్పటికే ‘మోంథా’ తీవ్రంగా ముంచే యగా.. ఉన్న పంటనైనా కాపాడుకుందామన్న అన్నదాతలను ‘దిత్వా’ భయపెడుతోంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కనీసం పట్టలు ఇచ్చేవారు కరువై.. రైతన్నలు పడరాని పాట్లు పడుతున్నారు.
తుఫాన్ ప్రభావంతో
చిరుజల్లులతో కూడిన వర్షం
రహదారుల పైనే ధాన్యం రాశులు
కాపాడుకునేందుకు పడరాని పాట్లు
హడావిడిగా కుప్పలు
వేసుకుంటున్న రైతులు
టార్ఫాలిన్లు సైతం ఇవ్వని ప్రభుత్వం
కంటిమీద కునుకు కరువు
కంటిమీద కునుకు కరువు
కంటిమీద కునుకు కరువు


