రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపిక

Nov 28 2025 8:33 AM | Updated on Nov 28 2025 8:33 AM

రాష్ట

రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపిక జాతీయ ఖోఖో పోటీలకు పంగులూరు విద్యార్థి జె.పంగులూరు: పంగులూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి పేరం వెంకటేశ్వర్లు జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం సోమేపల్లి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి 24 వరకు స్కూల్‌ ఫెడరేషన్‌ గేమ్స్‌ అండర్‌ 17 విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఖోఖో పోటీలు కాకినాడలో జరిగాయన్నారు. ఈ పోటీలకు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఖోఖో జట్టులో పంగులూరు పాఠశాలకు చెందిన పేరం వెంకటేశ్వర్లు ఆడాడు. ఈ పోటీలో మంచి ప్రతిభను కనబరచడంతో అండర్‌–17 విభాగంలో జాతీయ ఖోఖో పోటీలకు రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం మహిచేందుకు జట్టులో ఎంపిక చేశారు. జాతీయ ఖోఖో పోటీలు డిసెంబర్‌ 24 నుంచి మూడు రోజుల పాటు ఉత్తర ప్రదేశ్‌ లోని అయోధ్యలో జరుగుతాయని తెలిపారు. ఈ క్రీడాకారుడు గతంలో అండర్‌–14 సబ్‌ జూనియర్‌ విభాగంలో జాతీయ స్థాయి కర్ణాటకలోని జార్ఖాండ్‌లో జరిగిన పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీడీ మేక హరిబాబు, గ్రామపెద్దలు అభినందించారు. బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సుబ్బారావు

కారంచేడు: ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సత్యసాయి జిల్లా చిగిచెర్లలో జరగనున్న రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు కారంచేడు విద్యార్థులు ముగ్గురు ఎంపికై నట్లు పీడీ షేక్‌ మస్తానీ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రమైన కారంచేడులోని యార్లగడ్డ నాయుడమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వివరాలను తెలిపారు. పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులు కె. వెంకటలక్ష్మి, కె. మహేశ్వరితో పాటు, ఆరో తరగతి చదువుతున్న కె. మానస అండర్‌ 14 బాలికల విభాగంలో ఎంపికయ్యారన్నారు. కొత్తపట్నం గమల్లపాలెం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో వీరు విజయం సాధించారని తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికకావడంపై ఎంఈఓ ఎంవీ సత్యన్నారాయణ, మొలబంటి వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం ఎం. సాంమ్రాంజ్య అభినందించారు. రాష్ట్రస్థాయిలో విజయం సాధించి పాఠశాలకు, కారంచేడు గ్రామానికి కూడా పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

గుంటూరు మెడికల్‌: బీజేపీ కిసాన్‌ మోర్చా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వై.వి.సుబ్బారావును నియమిస్తూ పార్టీ రాష్ట్రకార్యవర్గం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న తనను గుర్తించి, తనకు కిసాన్‌ మోర్చా ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమార స్వామికి సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు నిబద్ధత, నిజాయితీతో నిర్వర్తించి రైతుల సమస్యల పరిష్కారానికి అంకితంమవుతానని తెలిపారు.

రాష్ట్రస్థాయి జూడో  పోటీలకు ఎంపిక 1
1/1

రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement