జిల్లా కోర్టులో న్యాయదేవత విగ్రహావిష్కరణ
నరసరావుపేట ఈస్ట్: సత్తెనపల్లి రోడ్డు పులపులవారి వీధిలో వేంచేసియున్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రాతి నిర్మాణానికి వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ కమిటీ కార్యదర్శి కొత్తమాసు వెంకటప్పయ్య, ప్రేమలత దంపతులు రూ.2,01,116 విరాళంగా అందించారు. ఆలయంలో శుక్రవారం పూజలు నిర్వహించిన దాతలు విరాళాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు వనమా సాంబశివరావు, కోవూరి శివశ్రీనుబాబు, గజవల్లి మురళిలకు అందించారు. మోదుగుల చంద్రం రూ.11,116 విరాళంగా అందించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు వనమా కృష్ణ, రాచూరి వెంక టేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి కార్తిక మాసంలో రూ.2.18 కోట్లు ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో డి.చంద్రశేఖర్ తెలిపారు. ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆదాయ వివరాలను ఈవో వెల్లడించారు. ఆస్ట్రేలియా డాలర్స్ 10, సింగపూర్ డాలర్స్ 10, అమెరికా డాలర్, 28 గ్రాముల బంగారం, 115 గ్రాముల వెండి హుండీల ద్వారా లభించినట్టు తెలిపారు.
యడ్లపాడు: గ్రావెల్ అక్రమ తవ్వకాలను ఉప్పరపాలెం గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. వంకాయలపాడు రెవెన్యూ పరిధిలో గురుకుల పాఠశాల సమీపంలో తవ్వకాలు నిర్వహిస్తున్న ప్రాంతానికి చేరుకుని గ్రావెల్ లోడుతో వెళ్తున్న వాహనాలను నిలుపుదల చేశారు. తమ గ్రామం పరిధిలోని ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు చేస్తే సహించబోమంటూ ఆగ్రహించారు. అడ్డుకున్న వారిలో గ్రామస్తులు పల్లపు వీర్ల అంకమ్మ, పల్లపు వెంకట్రావు, గుంజి శ్రీనివాసరావు, వల్లెపు అంకమ్మబాబు ఉన్నారు.
జిల్లా కోర్టులో న్యాయదేవత విగ్రహావిష్కరణ
జిల్లా కోర్టులో న్యాయదేవత విగ్రహావిష్కరణ
జిల్లా కోర్టులో న్యాయదేవత విగ్రహావిష్కరణ
జిల్లా కోర్టులో న్యాయదేవత విగ్రహావిష్కరణ


