ప్రకాశం జిల్లాలో మహనేత వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం

Statue Of YSR Destroyed By Unidentified People Prakasam District - Sakshi

ప్రకాశం: ప్రకాశంజిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బల్లికురవ మండలం కొప్పెరపాలెంలో దివంగ‌త మ‌హానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని  ధ్వంసం చేశారు. వైఎస్సార్‌ విగ్రహానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో వైఎస్సార్‌ విగ్రహం దెబ్బతినడమే కాకుండా మసిబారింది.

వైఎస్సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై స్థానికులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది టీడీపీ నేతలు చేసిన పనే అని వైఎస్సార్‌ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.  ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

చదవండి: చదువులమ్మకు చక్కనైన గుడి.. కృత్తివెంటి పాఠశాల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top