24 గంటల్లో 1,916 కేసులు

On November 1 AndhrOn November 1 Andhra Pradesh Records 1916 Corona Casessh Records 1916 Corona Cases - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 64,581 మందికి పరీక్షలు నిర్వహించగా..  1,916 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఏపీలో ఇప్ప‌టివ‌ర‌కు నిర్వ‌హించిన మొత్తం పరీక్షల సంఖ్య 81,82,266కి చేరింది. గడిచిన 24 గంటల్లో 3,033మంది కోలుకోగా.. ఇప్ప‌టివ‌ర‌కు 7,98,625 మంది క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్ర‌స్తుతం 22,538 యాక్టివ్ కేసులున్న‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 13 మంది కోవిడ్తో మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 6,719  కి చేరుకుంది. (చదవండి: మొదటి రోజు దాదాపు 80 శాతం హాజరు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top