ఏపీలో కొత్తగా 5,145 కరోనా కేసులు

New 5145 Corona Cases Reported In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షల సంఖ్య 64 లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,521 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 5,145 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,44,864 గా ఉంది. కరోనా నుంచి కొత్తగా 6,110 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,91,040గా ఉంది. చదవండి: ఏపీలో అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్‌ విడుదల

గత 24 గంటల్లో కొత్తగా 31 మంది మృతి చెందగా.. మొత్తంగా రాష్ట్రంలో 6,159 కోవిడ్‌ మరణాలు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 64,20,474 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా రాష్ట్రంలో మిలియన్‌ జనాభాకు 1,18,913మందికి కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 11.60గా ఉంది. చదవండి: సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలు..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top