ఏపీలో కొత్తగా 9747 పాజిటివ్‌, 67 మంది మృతి

Coronavirus 9747 Positive Cases Reported In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 64,147 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 9,747 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,76,333 కు చేరింది. తాజా పరీక్షల్లో 29,887 ట్రూనాట్‌ పద్ధతిలో, 34,260 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. కొత్తగా 6,953 మంది వైరస్‌ బాధితులు కోలుకుని మంగళవారం డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 95,625 కి చేరింది.

రాష్ట్రవ్యాప్తంగా 79,104  యాక్టివ్‌ కేసులున్నాయి. వైరస్‌ బాధితుల్లో తాజాగా 67 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1604 కు చేరింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 21,75,070 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో రికార్డ్‌ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపింది.
(సెల్ఫీ వీడియో: ఆసుప‌త్రిలో పృథ్వీరాజ్)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top