10,414 మంది డిశ్చార్జ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 24 గంటల్లో 10,414 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 1,91,117కు చేరినట్టు వైద్యారోగ్యశాఖ శనివారం బులెటిన్లో పేర్కొంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 వరకు 53,712 పరీక్షలు చేయగా, 8,732 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 2,81,817కి చేరాయి. తాజాగా 87 మంది మృతితో మొత్తం మరణాల సంఖ్య 2,562కు చేరింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 28,12,197 పరీక్షలు నిర్వహించారు. యాక్టివ్ కేసులు 88,138 ఉన్నాయి.