ఏపీలో కొత్తగా 7813 పాజిటివ్, 52 మంది మృతి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 53,681 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 7,813 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88,671 కు చేరింది. తాజా పరీక్షల్లో 27,955 ట్రూనాట్ పద్ధతిలో, 25,726 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. కొత్తగా 3,208 మంది వైరస్ బాధితులు కోలుకుని శనివారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 43,255 కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 44,431 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బాధితుల్లో తాజాగా 52 మంది మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 985 కు చేరింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 15,95,674 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది.
(చదవండి: లారీ నన్ను ఢీకొట్టలేదు: విజయ్బాబు)
సంబంధిత వార్తలు