ఏపీలో కొత్తగా 664 కరోనా కేసులు

Coronavirus: 664 New Positive Cases Registered In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 63,049నమూనాలు పరీక్షించగా 664 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,70,076 కు చేరింది. కొత్తగా 11 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 7,014కి చేరింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 835 మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,742యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top