ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 70,881 నమూనాలు పరీక్షించగా 3,676పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,79,146కు చేరింది. కొత్తగా 24 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,406కి చేరింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 5,529 మంది కోవిడ్ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 69,91,258 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37,102యాక్టివ్ కేసులు ఉన్నాయి.