ఏపీలో కొత్తగా 1,728 కరోనా కేసులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 77,148 నమూనాలు పరీక్షించగా 1,728 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,49,705కు చేరింది. కొత్తగా 9మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6837కి చేరింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,777మంది కోవిడ్ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 8 9,40,488మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,857యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరిన్ని వార్తలు