ఏపీలో 44 లక్షలకు చేరువలో కరోనా టెస్టులు

Coronavirus: 10175 Positive Cases Reported In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు 44 లక్షలకు చేరువలో ఉన్నాయి. గురువారం నాటికి 43,80,991 టెస్టులు పూర్త య్యాయి. గడిచిన 24 గంటల్లో 72,229 మం దికి టెస్టులు నిర్వహించారు. 10,175 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 10,040 మం ది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో 68 మంది కోవిడ్‌ బారిన పడి మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 5,37,687 మంది కరోనా బారిన పడగా, 4,35,647 మంది కోలుకున్నారు. 97,338 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 4,702కు చేరింది. రాష్ట్రంలో మిలియన్‌ జనాభాకు82,041 టెస్టులు నిర్వహిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top