ఏపీలో 29 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
7,866 మంది డిశ్చార్జ్
తాజాగా 6,780 కేసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పరీక్షలు 29 లక్షలు దాటాయి. సోమవారం 44,578 పరీక్షలు చేయగా 6,780 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 29,05,521కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ సోమవారం బులెటిన్లో పేర్కొంది. మొత్తం పాజిటివ్ కేసులు 2,96,609కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 7,866 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2,09,100కి చేరింది. తాజాగా 82 మంది మృతితో మొత్తం మరణాలు 2,732కు చేరాయి. యాక్టివ్ కేసులు 84,777 ఉన్నాయి. (కిరణ్ మజుందార్ షాకి కరోనా పాజిటివ్)