85.91 శాతానికి చేరిన రికవరీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇది మంచి పరిణామమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 74,595 టెస్టులు చేయగా, 8,218 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10,820 మంది కరోనా నుంచి కోలుకుని శనివారం డిశ్చార్జి అయ్యారు. 58 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా టెస్టుల సంఖ్య 50,33,676కు చేరింది.
రాష్ట్రంలో ఇప్పటివరకూ 6,17,776 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 5,30,711 మంది కోలుకోగా 81,763 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ కారణంగా మరణించినవారి సంఖ్య 5,302కు చేరింది. ప్రతి పదిలక్షల జనాభాకు 94,264 టెస్టులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటిస్థానంలో కొనసాగుతోంది.