రికవరీ రేటు 73.66 శాతం

Corona Recovery Rate Is Above 73 Percent In AP - Sakshi

గడిచిన 24 గంటల్లో 7,895 మందికి కోవిడ్‌ పాజిటివ్‌

పదిలక్షల జనాభాకు 60 వేలకుపైగా టెస్టులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు 60,637 కోవిడ్‌ టెస్టులు చేస్తున్నట్లు ఆదివారం నాటి గణాంకాల ప్రకారం స్పష్టమవుతోంది. అంతేగాక తాజాగా కోవిడ్‌ పరిస్థితులను బట్టి ఇప్పటివరకూ కోలుకున్న రోగుల సంఖ్య (రికవరీ రేటు) 73.66 శాతానికి చేరింది. గడిచిన 24 గంటల్లో 46,712 టెస్టులు చేయగా 7,895 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. కోవిడ్‌ కారణంగా 93 మంది మరణించారు. ఆదివారం ఒక్కరోజే 7,449 మంది డిశ్చార్జి అయ్యారు. అంతకుముందు రోజు అంటే ఈనెల 22వ తేదీ (శనివారం) 61,469 పరీక్షలు నిర్వహించగా 10,276 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

ఇప్పటివరకూ రాష్ట్రంలో 32,38,038 టెస్టులు నిర్వహించగా 3,53,111 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఇప్పటికే 2,60,087 మంది కోలుకోగా, మరో 89,742 మంది చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌ కారణంగా మృతి చెందిన వారి మొత్తం సంఖ్య 3,282కు చేరింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,256 కేసులు, అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 142 కేసులు నమోదయ్యాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top